దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం

20 Dec, 2019 17:36 IST|Sakshi

 ఉత్తర భారతం భూకంపం, పాక్‌లోనూ

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు స్థానికులను వణికించాయి. ఢిల్లీ నుంచి కశ్మీర్‌ వరకు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతం, పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ సరిహద్దులో భూమి కంపించింది. ఢిల్లీలో రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.3గా నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

మరిన్ని వార్తలు