సిక్కింలో భూకంపం

3 Oct, 2013 15:26 IST|Sakshi

సిక్కింలో గురువారం స్వల్పంగా భూమి కంపించింది. రెక్టార్ స్కేల్పై దీని తీవ్రత 5గా నమోదైనట్టు ప్రాంతీయ భూకంప హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. ఉదయం 11.43 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు వెల్లడించింది.

భూకంప ప్రభావానికి గ్యాంగ్టక్లో కొన్ని భవనాలకు బీటలు బారినట్టు అధికారులు తెలిపారు. భయబ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లల్లో నుంచి వీధులోకి వచ్చారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు.

>
మరిన్ని వార్తలు