ఢిల్లీలో కంపించిన భూమి

12 Apr, 2020 17:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ-ఎన్‌ఆర్సీ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూ ప్రకంపనలు 3.5గా నమోదు అయ్యాయి. భూ ప్రకంపనలతో జనాలు  ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు