మాజీ సీఎం ఆస్తుల అటాచ్‌

18 May, 2019 08:03 IST|Sakshi

న్యూఢిల్లీ: నగదు అక్రమరవాణా కేసులో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్‌ చౌతాలాకు చెందిన రూ.1.94 కోట్ల ఆస్తులను శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అటాచ్‌ చేసింది. భూమి, ఫాం హౌస్‌లను అటాచ్‌ చేసింది. ఓం ప్రకాశ్‌ చౌతాలా, ఆయన కుమారులు అజయ్, అభయ్‌తో పాటు మరికొందరిపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఇందులో భాగంగా ఈడీ చర్యలు చేపట్టింది. అయితే గత నెలలోనే రూ.3.68 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. 

మరిన్ని వార్తలు