రూ.16 కోట్ల జకీర్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌

20 Jan, 2019 05:29 IST|Sakshi

న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్‌ నాయక్‌కు సంబంధించిన రూ. 16.40 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈ ఆస్తులను జప్తు చేసినట్లు శనివారం వెల్లడించింది. జకీర్‌ కుటుంబసభ్యుల పేరిట ముంబై, పుణేలో ఉన్న ఈ స్థిరాస్తులను ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ (పీఎమ్‌ఎల్‌ఏ) కింద జప్తు చేసినట్లు పేర్కొంది. జకీర్‌ బ్యాంక్‌ ఖాతాకు వచ్చిన విరాళాలను తన భార్య, కొడుకు, మేనకోడలు అకౌంట్లకు పంపినట్లు ఆధారాలు సేకరించిన ఈడీ ఈ ఆస్తులను జప్తు చేసింది. జప్తు చేసిన వాటిలో ముంబైలోని ఫాతిమా హైట్స్, ఆఫియా హైట్స్‌ భవంతులతో పాటు బాందప్‌ ప్రాంతంలోని ఆస్తులు, పుణేలోని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు