రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు

25 May, 2019 16:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిశారు. 17వ లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల జాబితాను శనివారం రాష్ట్రపతికి అందజేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ 17వ లోక్‌సభ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. మరికొద్దిసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో నరేంద్ర మోదీని పార్లమెంటరీ పార్టీ నేత(ప్రధాని)గా ఎన్నుకోనున్నారు ఎంపీలు. అనంతరం నరేం‍ద్ర మోదీ రాష్ట్రపతిని కలిసి, తీర్మాన ప్రతిని అందజేయనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌.. నరేంద్ర మోదీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు.

మరిన్ని వార్తలు