ఈ నెల 19 రాజ్యసభ ఎన్నికలు

1 Jun, 2020 18:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. 18 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు సోమవారం తేదీలను ప్రకటించింది. ఈనెల 19న ఉదయం 9 నుంచి 4 గంటల వరకు పోలింగ్‌ జరుపుతామని తెలిపింది. అదో రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తామని సీఈసీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు, గుజరాత్‌ 4, జార్ఖండ్‌ 2, మధ్యప్రదేశ్‌ 3, మణిపూర్‌ 1, రాజస్తాన్‌ 3, మేఘాలయలో 1 స్థానానికి సీఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరిస్తూ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

మరిన్ని వార్తలు