తీవ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య హోరాహోరీ కాల్పులు

18 Dec, 2014 15:59 IST|Sakshi

శ్రీనగర్ : కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య గురువారం మరోసారి హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. కుప్వారా జిల్లాలోని బాజ్పోరా ప్రాంతంలో తీవ్రవాదులు తలదాచుకున్నారని భద్రత సిబ్బందికి సమాచారం అందింది. దాంతో వారు బాజ్పోరా ప్రాంతంలో్ తనిఖీలు చేపట్టారు.

ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు ...  భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. వారు వెంటనే అప్రమత్తమై తీవ్రవాదులపై కాల్పులు జరిపారు. ఇరువైపులా హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి.  ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించాడు. ముందుగా భద్రతాదళాల మీద తీవ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఓ తీవ్రవాది హతమయ్యాడు.

మరిన్ని వార్తలు