షోపియాన్లో ఎన్కౌంటర్: తీవ్రవాదులు హతం

15 Jan, 2015 16:28 IST|Sakshi
షోపియాన్లో ఎన్కౌంటర్: తీవ్రవాదులు హతం

శ్రీనగర్:  దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రత దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. కెల్లార్ ప్రాంతంలోని కద్దార్ అటవీ ప్రాంతంలో భద్రత దళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు... భద్రత దళాలపై కాల్పులు జరిపారు. దాంతో అప్రమత్తమైన భద్రత దళాలు వెంటనే తీవ్రవాదులపై కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరు గయపడలేదని భద్రత దళాలకు చెందిన ఉన్నాతాధికారులు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు