జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

24 Mar, 2018 11:28 IST|Sakshi

జమ్మూ కాశ్మీర్‌ : జమ్మూ కాశ్మీర్‌ అనంతనాగ్‌ జిల్లా డోరులో ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో షిష్టార్గం గ్రామాన్ని భద్రతా దళాల అధికారులు చుట్టుముట్టారని తెలిపారు. దీంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయన్నారు. 

>
మరిన్ని వార్తలు