జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

2 Jun, 2019 09:15 IST|Sakshi

సాక్షి, డుంకా: జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. జార్ఖండ్‌లోని డుంకాలో ఆదివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులు పరస్పరం ఎదురుపడటంతో పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానికంగా కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు