అయ్యో! ఇషా గుప్తా 

16 Aug, 2019 10:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆగస్టు 15వ తేదీన గణతంత్ర దినోత్సవ శుభాకాం క్షలు తెలిపిన బాలీవుడ్‌ నటి ఇషా గుప్తాపై సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో కామెంట్లు వెల్లువెత్తాయి. గురువారం మాజీ మిస్‌ ఇండియా ఇషా మాత్రం ‘గణతంత్ర దిన శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అంతే.. నెటిజన్లు వెంటనే తమదైన శైలిలో స్పందించారు. ఇషా గుప్తా బాధ్యత లేకుండా వ్యవహరించారని కొందరు విమర్శించారు. తన అకౌంట్‌ హ్యాక్‌ అయిందని ఇషా తెలపడంతో కథ ముగిసింది.

మరిన్ని వార్తలు