తెలంగాణలో సీఎన్జీ స్టేషన్లు నెలకొల్పండి

31 Mar, 2016 00:11 IST|Sakshi
తెలంగాణలో సీఎన్జీ స్టేషన్లు నెలకొల్పండి

పెట్రోలియం మంత్రికి దత్తాత్రేయ వినతి

 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు గ్యాస్ కనెక్షన్లు పెంచాలని, సీఎన్జీ స్టేషన్లు ఏర్పా టు చేయాలని పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం తన కార్యాలయానికి వచ్చి భేటీ అయిన సందర్భంలో దత్తాత్రేయ ఈ విషయాలను చర్చించారు.

హైదరాబాద్ నగరంలో సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ ఔట్‌లెట్లు ఏర్పాటు చేయాలని, నేదునూరు, శంకరపల్లిల్లో ప్రతిపాదిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు గ్యాస్ కేటాయించాలని కోరారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడుతూ, ‘భాగ్యనగర్ గ్యాస్’ పేరుతో హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న సీఎన్జీ స్టేషన్లకు గ్యాస్ పెంపు, స్టేషన్ల పెంపుపై అధికారులతో చర్చిస్తామన్నారు.

మరిన్ని వార్తలు