డిసెంబర్‌1 నుంచి అమల్లోకి రానున్న ‘ఫాస్టాగ్‌’

29 Nov, 2019 16:18 IST|Sakshi

టోల్‌ప్లాజా వచ్చిందంటే చాలు గంటల తరబడి నిరీక్షించాల్సిందే. అప్పటివరకు రయ్‌మంటూ సాగే వాహనాలకు టోల్‌ప్లాజాలు అడ్డుకట్టగా మారేవి. బారులు తీరిన వాహనాలకు రుసం వసూలు చేస్తూ..బోలెడు సమయం వృథా అయ్యేది. దీనికి పరిష్కారంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ-రుసుం చెల్లింపుతో కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. టోల్‌గేట్ల వద్ద ఛార్జీల చెల్లిపులను ఎలక్ర్టానిక్‌ పద్దతిలో జరిపేందుకు ఉద్దేశించిన ఈ విధానం డిసెంబర్‌ 1 నుంచి తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్‌ విధివిధానాలు, అసునరించాల్సిన పద్దతులేంటో తెలుసుకుందాం.

-ఫాస్టాగ్‌ కలిగిన వాహనం టోల్‌ఫ్లాజా దగ్గరకు రాగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్‌ టెక్నాలజీ ద్వారా ప్రీపెయిడ్‌ అకౌంట్‌కి చెల్లింపులు జరుగుతాయి. 
-ఫాస్టాగ్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ను వాహనం ముందు భాగంలో విండ్‌సస్ర్కీన్‌పై అతికించాల్సి ఉంటుంది.
-ఎన్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ వంటి బ్యాంకుల ద్వారా కూడా వీటిని పొందవచ్చు.
-ఫాస్టాగ్‌ను ఒక వాహనానికి మాత్రమే వినియోగించేలా రూపొందించారు.

* టోల్‌ప్లాజా వచ్చినప్పుడు ఫాస్టాగ్‌ ఉన్న లేన్‌ను చూపుతూ కొన్ని బోర్డులు ఉంటాయి. ఆ మార్గంలోనే ఫాస్టాగ్‌ వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది.
* నిర్దేశించిన లేన్‌లో వెళ్లినప్పుడు వాహన వేగం 25-30కి మించి ఉండకూడదు. 
* అలాగే మీరు వెళ్తున్న లేన్‌లో మీ ముందున్న వాహనానికి కనీసం 10 మీటర్ల దూరం పాటించాలి.
* ఒకసారి మీ ఫాస్టాగ్‌ రీడ్‌ అయిన తర్వాత మీ వాహనం ముందుకు సాగొచ్చనే సంకేతంగా అక్కడ గ్రీన్‌ లైట్‌ వెలుగుతుంది. అప్పుడే ముందుకు వెళ్లాలి.
*  గ్రీన్‌ లైట్‌ వెలిగిన తర్వాత కూడా వాహనాన్ని ఎక్కువ సమయం అక్కడే ఉంచితే... బారియర్‌ గేట్‌ మళ్లీ పడిపోయే అవకాశం ఉంది.
* ఒకవేళ ఏదైనా కారణంతో మీ ఫాస్టాగ్‌ పనిచేయకపోతే అక్కడ ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఎరుపు రంగులోకి మారుతుంది.
* అప్పుడు టోల్‌ప్లాజా సిబ్బంది తమ చేతిలో ఉన్న పరికరంతో మీ ఫాస్టాగ్‌ను స్కాన్‌ చేస్తారు. ఒకవేళ ఎలాంటి ఇబ్బందీ లేకుంటే ఆకుపచ్చ లైట్‌ వెలుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే  టోల్‌ఛార్జీని రుసుము ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు