రాజ్యసభలో ఆర్థిక బిల్లుకు ఆమోదం

29 Mar, 2017 18:10 IST|Sakshi

న్యూఢిల్లీ: కీలకమైన ఆర్థిక బిల్లుకు రాజ్యసభ  బుధవారం ఆమోదం తెలిపింది. సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు సభ ఆమోదించింది. అంతకు ముందు కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుపై కాంగ్రెస్‌ పార్టీ పలు సవరణల ప్రతిపాదించింది. బిల్లులో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరి ఓటింగ్‌ కోరారు. దీనిపై ఓటింగ్‌ అనంతరం ఆర్థిక బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. కాగా ఆర్థిక బిల్లుపై చర్చ జరుగుతుండగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

మరిన్ని వార్తలు