యువతిని ఫొటోలు తీసిన ఐపిఎస్ అధికారికి దేహశుద్ధి

27 May, 2014 20:49 IST|Sakshi
యువతిని ఫొటోలు తీసిన ఐపిఎస్ అధికారికి దేహశుద్ధి

బెంగళూరు:  ఒక కాఫీ షాపులో  సీనియర్ ఐపిఎస్ అధికారి ఒకరు తన సెల్తో  ఒక యువతిని ఫొటోలు తీశాడు. దాంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై అడిషనల్ డైరెక్టర్ జనరల్ పి.రవీంద్రనాథ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై ఐపిసి 354, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

రవీంద్రనాథ్ అభ్యంతరకరమైన ఫొటోలు తీసినట్లు ఆ యువతి ఫిర్యాదు చేసిందని డిసిపి రవికాంత్ గౌడ్ చెప్పారు. అతనిపై కేసు నమోదు చేశామని, అవసరమైతే అతనిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా, తాను ఫొటోలు ఏమీ తీయలేదని రవీంద్రనాథ్ చెప్పారు.

మరిన్ని వార్తలు