రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు

28 Feb, 2016 19:55 IST|Sakshi
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జేఎన్యూ వివాదానికి సంబంధించి రాజద్రోహం ఆరోపణలతో సైబారాబాద్ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

రాహుల్ తోపాటు కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ, కేసీ త్యాగి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేఎన్ యూ విద్యార్థి నేతలు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్,  వామపక్ష నేతలు డీ రాజా, సీతారం ఏచూరిపై కూడా కేసు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 124(ఏ) 156 (3) కింద ఆరోపణలు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు