న్యూఢిల్లీ : ఢిల్లీలోని శాస్త్రి భవన్లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డి బ్లాక్లో మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.