టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

13 Aug, 2019 12:22 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని గాంధీ నగర్‌ టెక్స్‌టైల్‌ మార్కెట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద సంఖ్యలో ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

ఢిల్లీలోని షహదరా ప్రాంతంలోని గాంధీనగర్‌ మార్కెట్‌ ఆసియాలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ మార్కెట్‌గా గుర్తింపు పొందింది. ఈ మార్కెట్‌నూ ప్రతిరోజూ పదివేల మంది నుంచి ఇరవై వేల మంది వరకూ ప్రజలు సందర్శిస్తుంటారు.

మరిన్ని వార్తలు