స్కూల్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

8 Jun, 2019 16:00 IST|Sakshi

హర్యానా : హర్యానాలో ఫరిదాబాద్‌లోని దబువాలో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతిచెందారు. ఏఎన్‌డీ కాన్వెంట్‌ స్కూల్‌లో మంటలు చెలరేగాయి. పాఠశాల భవనంలోని కింది అంతస్థులో ఓ వస్త్ర దుకాణం కుడా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చింది. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అగ్నిమాపక సిబ్బంది తెలిపింది.

మరిన్ని వార్తలు