రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ముప్పు

26 Apr, 2019 09:12 IST|Sakshi

గ్వాలియర్‌ : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. క్యాంటిన్‌లో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్‌లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్యాంటిన్‌లో పని చేసేవారు, ప్రయాణికులు మంటలను గుర్తించి అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు