వాయుసేన అమ్ములపొదిలోకి యుద్ధ హెలికాప్టర్​

28 Jul, 2019 14:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌  మరింత శక్తిమంతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్​ అపాచీ ఏహెచ్‌ 64ఈ త్వరలో వాయుసేన అమ్ములపొదిలో చేరనుంది. అమెరికా విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ నాలుగేళ్ల క్రితం​ చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు హెలికాప్టర్లను భారత్‌కు అందజేసింది. మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లకు డీల్‌ కుదరగా తొలి విడతగా నాలుగు హెలికాప్టర్లు ఐఏఎఫ్‌కి అందాయి. వచ్చేవారం మరో నాలుగు వస్తాయి. మొత్తం ఎనిమిది అపాచీ హెలికాప్టర్లు పఠాన్​కోట్ వైమానిక కేంద్రం నుంచి త్వరలో భారత వైమానిక దళంలో లాంఛనంగా చేరనున్నాయి. అపాచీ చేరికతో తమ పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని ఐఏఎఫ్​ ఆశాభావం వ్యక్తంచేసింది.

మరిన్ని వార్తలు