మృత్యు పిడుగు.. ఐదుగురిని చంపేసింది!

28 Jun, 2017 20:05 IST|Sakshi

డిండోరి(మధ్యప్రదేశ్‌): మృత్యు రూపంలో వచ్చిన పిడుగు ఐదుగురిని బలి తీసుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం డిండోరి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఒక మహిళతోపాటు నలుగురు బాలికలు మృతి చెందారు.

భరోతి గ్రామానికి చెందిన మహేశ్వరి పరాస్తే(26) ఆమె కుమార్తె శారద(9), పూనం (13), సుష్మా(13), నాన్‌ బాయి(14) కలిసి బుధవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని నదిలో స్నానం చేసి తిరిగి వస్తుండగా వారిపై పిడుగు పడింది. షాక్‌కు గురైన వారంతా అక్కడికక్కడే చనిపోయారు. ఇదిలా ఉండగా, వచ్చే 48 గంటల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు