రోడ్డుప్రమాదంలో ఐదుగురి మృతి

17 Sep, 2016 12:46 IST|Sakshi

రాంచీ : జర్ఖాండ్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. హజారీబాగ్ జిల్లాలో ఈ రోజు ఉదయం బస్సు, ట్రక్ ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బస్సు రాంచీ నుంచి బిహార్ శివాన్ జిల్లాకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు