ఆ ఐదు పార్టీల్లో బీఎస్పీ టాప్‌!

8 Feb, 2018 04:29 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని ఐదు జాతీయ పార్టీల ఆదాయం(కాంగ్రెస్, బీజేపీ మినహా) కలిపి రూ.299.54 కోట్లు కాగా, బీఎస్పీ రూ.173.58 కోట్లతో సింహభాగంలో ఉంది. రూ.100.25 కోట్లతో సీపీఎం తర్వాతి స్థానంలో ఉందని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వెల్లడించింది. అయితే, 2016–17 కాలానికి ఆడిట్‌ నివేదిక సమర్పణ గడువు ముగిసినా కాంగ్రెస్, బీజేపీ ఇంకా ఆదాయ వివరాలను సమర్పించలేదంది.

>
మరిన్ని వార్తలు