లక్నో : ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అనుమాన్పదంగా మృతిచెందిన ఘటన శనివారం ఉత్తరప్రదేశ్ శ్రీనగర్ కాలనీలోని చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇంట్లో దాదాపు అన్ని వస్తువులు చెక్కుచెదరకుండా ఉన్నాయని, కాబట్టి బయటి వ్యక్తులు వచ్చినట్లు ఎటువంటి ఆనవాళ్లు కనపడటం లేదని తెలిపారు. ఇనుపగేటు కావడంతో గ్యాస్ కట్టర్ను ఉపయోగించి లోపలికి వచ్చామని ఎస్పీ సునీల్ కుమార్ సింగ్ అన్నారు. పాలవాడు ఎన్ని సార్లు తలపుఉ కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులకు చెప్పగా, వారు పోలీసులకు సమాచారం అందించారు.
మృతులను వైద్య శాఖలో క్లర్క్గా పని చేసి రిటైరైన రాజేశ్వర్ పచౌరీ(75)తో పాటు అతని కుటుంబసభ్యులు దివ్య పచౌరీ(33), బాబుల్(25), దివ్య కుమారులు ఆరుశ్(10), లాలూ(1)గా గుర్తించారు. మృతులలో దివ్య శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈమె మృతదేహం గేటు ఎంట్రన్స్ దగ్గరే పడి ఉండగా, రాజేశ్వర్ డెడ్బాడీ హాల్లో , ఇద్దరు పిల్లల మృతదేహాలు బెడ్ రూంలో పడిఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల మరణాలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించామని, మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించి బంధువులకు సమాచారం అందించామని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.