అకస్మాత్తుగా టేకాఫ్‌ రద్దు, విమానంలో కేంద్రమంత్రి

13 Aug, 2019 11:09 IST|Sakshi

విమానంలో సాంకేతికలోపం, టేకాఫ్‌ రద్దు

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సహా 143మంది ప్రయాణీకులు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్‌గడ్కరీ ప్రయాణించే  ఇండిగో విమానాన్ని అకస్మాత్తుగా నిలిపి వేయాల్సి వచ్చింది. నాగపూర్‌ నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో తీవ్రమైన సాంకేతికలోపం తలెత్తడంతో  టేకాఫ్‌ను నిలిపివేశారు. ఇండిగో ఫ్లైట్ 6 ఇ 636లో లోపాన్ని గుర్తించిన పైలట్‌  టేకాఫ్‌ను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఇండిగో కూడా ధృవీరించింది. కేంద్రమంత్రి గడ్కరీ సహా, 143 మంది ప్రయాణీకులు ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమాచారం అందించామని వెల్లడించింది.  ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ నాగపూర్‌ విమానాశ్రయం సీనియర్‌  డైరెక్టర్‌  విజయ్‌ మూలేకర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు