కువైట్‌కు విమానాలు రద్దు

7 Mar, 2020 12:24 IST|Sakshi

కువైట్‌   ట్రావెల్‌ బ్యాన్‌, కేరళ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల అవస్థలు

కేరళలో చిక్కుకుపోయిన 170మంది ప్రయాణీకులు

తిరువనంతపురం :  కోవిడ్ -19  ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున‍్న భయాల  నేపథ్యంలో కువైట్‌ కీలక నిర్ణయం  తీసుకుంది.  భారతదేశంతో సహా ఏడు దేశాల నుంచి విమాన  సర్వీసులను నిలిపివేసింది. ఈ ఆదేశాలు ఒక వారం పాటు అమల్లో వుంటాయని కువైట్‌ అధికారులు ప్రకటించారు. శనివారం కువైట్ ఆరోగ్య అధికారులు తీసుకున్న ఈ  ఆకస్మిక ప్రయాణ నిషేధంతో  కోజికోడ్‌ కరీపూర్‌ విమానాశ్రయంలో 170 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్ట్, సిరియా,  లెబనాన్ నుండి కువైట్‌కు వెళ్లే అన్ని విమానయాన సంస్థలకు ఈ నిషేధం వర్తిస్తుంది.

మరిన్ని వార్తలు