హైజాక్ హెచ్చరిక.. విమానాశ్రయాలు అలర్ట్

5 Jan, 2015 06:00 IST|Sakshi
హైజాక్ హెచ్చరిక.. విమానాశ్రయాలు అలర్ట్

న్యూఢిల్లీ: విమానాల హైజాక్‌కు కుట్ర జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. ప్రయాణికులను, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించిన తర్వాత కూడా లగేజీని జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు