సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. సమీప దూరంలోని వస్తువులు, వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని నడపాల్సి వస్తున్నది. అలాగే పొగమంచు కారణంగా 22 రైళ్లను రద్దు చేయగా 32 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రెండు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు.