ఎయిర్‌పోర్టును కమ్మేసిన పొగమంచు..

26 Dec, 2017 16:29 IST|Sakshi

90 విమానాల రాకపోకలకు అంతరాయం

సాక్షి, దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ  ఎయిర్‌పోర్టులో మంగళవారంనాడు దట్టమైన పొగమంచు కమ్మేసిన కారణంగా సుమారు 90 పైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజాము 6 గంటల నుండి 9 గంటల వరకూ ఏర్‌పోర్ట్‌ చుట్టుపక్కల పొగమంచు కమ్మేసింది. దీంతో అటు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లాల్సిన విమానాలు నిలిచిపోయాయి.

కేఐఏఎల్‌కు రావాల్సిన విమానాలను దారిమళ్లించారు. ముఖ్యంగా లండన్‌ వెళ్లాల్సిన బీఏ-118 బ్రిటీష్‌ ఏర్‌వేస్,అమెరికన్‌ ఏర్‌వేస్‌ ఐబీ-47652 ఇబ్రియా ఎయిర్‌వేస్‌ ,దుబాయ్‌ వెళ్లాల్సిన ఇండిగో తదితర అంతర్‌ రాష్ట్రీయ విమానాలు ఆలస్యంగా ఎగిరాయి.బ్రెజిల్ ,సింగపూర్, అబుదాబి తదితర దేశాల నుండి రావాల్సిన విమానాలు ఆలస్యంగా వచ్చాయి. మరికొన్ని విమానాలకు ఇతర ఏర్‌పోర్ట్‌లకు దారిమళ్లించారు. 9 గంటల తరువాత పొగమంచు తగ్గాక విమానాలు రాకపోకలు ప్రారంభించాయి.

మరిన్ని వార్తలు