భోపాల్: బీజేపీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్లాల్ పట్వా(92) బుధవారం కన్నుమూశారు. ఉదయం గుం డెపోటు రావడంతో ఆయన్ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితమే మరణించారు. వారికి సంతానం లేదు. మేనల్లుడు సురేంద్ర పట్వా ప్రస్తుతం మధ్యప్రదేశ్ మంత్రిగా పనిచేస్తున్నారు. పట్వాకు గౌరవ సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. ఆయన మృతదేహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు.