మరో మాజీ మిలిటెంట్ కాల్చివేత

15 Jun, 2015 11:24 IST|Sakshi
మరో మాజీ మిలిటెంట్ కాల్చివేత

శ్రీనగర్:   జమ్ము కశ్మీర్లో పౌరుల ప్రాణాలకు  రక్షణ లేకుండా పోతోంది.  కశ్మీర్లోని  సొపారాలో మాజీ మిలిటెంట్ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం కాల్చి చంపారు. ముంద్జీ గ్రామానికి చెందిన అజయ్ అహ్మద్ రేషిపై  ఓ దుండగుడు తుపాకీతో అతి సమీపంనుంచి  కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో అతను చనిపోయాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి చెప్పిన అజయ్  సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ వార్త  దావానంలా వ్యాపించడంతో ఆందోళన చెలరేగింది.  అక్కడక్కడ రాళ్లు రువ్విన సంఘటను చోటు  చేసుకున్నాయి. షాపులను మూసి వేశారు.    కాగా గత మూడు వారాలుగా ఆరుగురు మాజీ మిలిటెంట్లు దుండగుల చేతుల్లో హతమయ్యారు.
 

మరిన్ని వార్తలు