మాజీ సీఎం కాన్వాయ్‌కి టోల్‌ ఫీజు లేదా..?

9 Aug, 2017 20:45 IST|Sakshi
మాజీ సీఎం కాన్వాయ్‌కి టోల్‌ ఫీజు లేదా..?
లక్నో: ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ తన కాన్వాయ్‌ టోల్‌ ఫీజ్‌ చెల్లించలేదు. బుధవారం175 కార్ల బారీ కాన్వాయ్‌తో బయలు దేరిన అఖిలేష్‌ బారాబంకి టోల్‌ ప్లాజాలో టోల్‌ ఫీజు చెల్లించలేదని ఆ టోల్‌ ప్లాజా మెనేజర్‌ ఆరోపించారు. టోల్‌ ఫీజు చెల్లించకుండా  మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో175 కార్లు వెళ్లినట్లు టోల్‌ ప్లాజా సీసీటీవీలో స్పష్టంగా కనిపిస్తోంది.
 
ఈ వీడియోను ఏఎన్‌ఐ సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌ వాధీ పార్టీ ఘోర పరాజయం పొంది ప్రతిపక్షానికే పరిమితమైన విషయం తెలిసిందే. కానీ అఖిలేష్‌ మాత్రం ఇంకా సీఎంగానే భావిస్తూ అధికార దర్పం ప్రదర్శిస్తున్నట్లు ఈ ఘటనతో తెలుస్తోంది.