అస్వస్థతకు గురైన మాజీమంత్రి..

16 Aug, 2016 14:14 IST|Sakshi

మాల్దాః మాజీ కేంద్రమంతి కృష్ణేందు నారాయన్ చౌదురి అస్వస్థతకు గురయ్యారు. ఆయన గుండెనొప్పితో బాధపడుతుండటంతో పశ్చిమబెంగాల్ మాల్దాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం లో చేర్పించి చికిత్స అందించారు.

ఉదయం ఛాతీలో నొప్పిరావడంతో చౌదురి.. నర్సింగ్ హోం కు వచ్చారని, ఆయన్ను ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యం అందించినట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం ఆయన్నుచికిత్సకోసం కోల్ కత్తా తరలించినట్లు వెల్లడించారు. 58 ఏళ్ళ చౌదురి ప్రస్తుతం ఇంగ్లీష్ బజార్ మున్సిపాలిటీకి ఛైర్మన్ గా ఉన్నారు.

మరిన్ని వార్తలు