భీకరపోరు: ఐదుగురు జవాన్ల వీర మరణం

3 May, 2020 08:53 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల మరోసారి రక్తపాతం సృష్టించారు. భారత​ జవాన్లను లక్ష్యంగా చేసుకుని భీకర కాల్పులకు దిగారు. ఆదివారం ఉదయం హంద్వారా సమీపంలో దాదాపు 8 గంటల పాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదురుగు జవాన్లు వీర మరణం పొందారు. వీరిలో సీనియర్‌ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఓ మేజర్‌ కూడా ఉన్నారు. అయితే ఉగ్రవాదుల కాల్పులను వెంటనే తిప్పి కొట్టిన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. కాగా గత 15 రోజులకుగా కశ్మీర్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులు కాల్పులకు దిగుతున్న విషయం తెలిసిందే. తాజా ఎన్‌కౌంటర్‌తో భద్రతా బలగాలు మరింత అ‍ప్రమత్తం అయ్యాయి.


మరిన్ని వార్తలు