నలుగురు ఉగ్రవాదులు హతం

10 Apr, 2017 12:10 IST|Sakshi
నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: అక్రమంగా భారత్‌లోకి అడుగుబెట్టడానికి యత్నించిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది తుదిముట్టించారు.

కెరాన్‌ సెక్టార్‌ ప్రాంతంలో చొరబాటుకు యత్నిస్తుండగా.. భద్రతా సిబ్బంది వారిపైకి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు తీవ్రవాదులు హతమయ్యారని.. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని.. అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు