‘స్వేచ్ఛ.. కొందరికే పరిమితం కాకూడదు’

16 Aug, 2016 03:22 IST|Sakshi
‘స్వేచ్ఛ.. కొందరికే పరిమితం కాకూడదు’

న్యూఢిల్లీ: స్వేచ్ఛ అనేది ఏ కొందరికో పరిమితం కాకూడదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇటీవల కొన్ని అరాచక శక్తులు మనలోని కొందరి స్వేచ్ఛను హరించాలని ప్రయత్నించడాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. స్వేచ్ఛ ఏ ఒక్కరి సొత్తూ కాదు.. అది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. భారత్‌లోని ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, గౌరవం పొందే హక్కు ఉన్నాయి’ అని స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు