నెస్లే సంస్థకు ఊరట..

4 Aug, 2015 21:25 IST|Sakshi
నెస్లే సంస్థకు ఊరట..

న్యూఢిల్లీ : ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెస్లే సంస్థకు కొంత ఊరట లభించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ మాగీ న్యూడుల్స్ సురక్షితమేనని క్లీన్ చిట్ ఇచ్చింది. కేంద్ర ఆహార పరిశోధన సంస్థ శాంపిల్ టెస్టులో ప్రమాణాలు పాటించినట్లు గుర్తించింది. గోవా ఎఫ్డీఏ పంపించిన ఐదు శాంపిల్స్ను పరీక్షించి గత జూన్ లో మ్యాగీ న్యూడుల్స్పై నిషేధం విదించిన విషయం విదితమే. ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలు 2011 పాటించిన నేపథ్యంలో తాజాగా మైసూర్ ల్యాబోరేటరీలో జరిపిన టెస్టుల ద్వారా వీటికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు గోవా ఎఫ్డీఏ డైరక్టర్ సలీం ఏ వెల్జీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు