గంగోత్రిధామ్‌ మూసివేత

21 Oct, 2017 03:27 IST|Sakshi

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని పవిత్రమైన గంగోత్రి ధామ్‌ను శీతాకాలం సందర్భంగా శుక్రవారం నుంచి మూసివేశారు. భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 11.40 గంటల ప్రాంతంలో గుడి తలుపులు మూసేశారు. ఆర్నెల్లపాటు ఈ ఆలయాన్ని మూసే ఉంచుతారు. గంగానది జలాలను అందంగా అలకరించిన పల్లకిలో ఉంచి సమీపంలోని ముక్భా గ్రామానికి తరలించారు. భక్తులు ఉత్సాహంగా ఈ పల్లకీ సేవలో పాల్గొన్నారు. తిరిగి గుడి తెరిచేంతవరకు ఈ జలాలనే యాత్రికులు పూజిస్తారు. 

మరిన్ని వార్తలు