పోలీసులపై గ్యాంగ్స్టర్ల కాల్పులు

11 Feb, 2017 12:05 IST|Sakshi
పోలీసులపై గ్యాంగ్స్టర్ల కాల్పులు

చండీగఢ్: పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో గ్యాంగ్స్టర్లు, పోలీసుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పక్కా సమాచారం ప్రకారం శనివారం గ్యాంగ్స్టర్లను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య 100 రౌండ్ల కాల్పులు చోటుచేసుకోవడంతో మాకు పట్టణ పరిసర ప్రాంతాల్లో కలకలం సృష్టించింది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చేసుకోలేదు. నలుగురు గ్యాంగ్స్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల గురుహర్ సహాయ్ పట్టణంలోని ఓ పోలీస్ష్టేషన్ వెలుపల కాల్పులు జరగడంతో గ్యాంగ్స్టర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.

మరిన్ని వార్తలు