నెపుణ్యాల అభివృద్ధిలో జర్మనీ సహకారం

9 Sep, 2014 01:58 IST|Sakshi

మోడీతో జర్మనీ విదేశాంగమంత్రి భేటీ
 
న్యూఢిల్లీ: నైపుణ్యాల అభివృద్ధి, నదుల పరిశుభ్రత, ఘనవ్యర్థాల నిర్వహణలో పరస్పరం సహకారానికి ఓ రోడ్ మ్యాప్ రూపొందించుకోవాలని భారత్, జర్మనీ నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్యా సోమవారం అంగీకారం కుదిరింది. భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మెయిర్ సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వీరి మధ్య పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. గత దశాబ్ద కాలంలో ఆర్థికంగా జర్మనీ సాధించిన ప్రగతిని మోడీ ప్రశంసించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
 
 

మరిన్ని వార్తలు