తుపాకీతో బెదిరించి బాలికపై అత్యాచారం

26 May, 2014 01:59 IST|Sakshi

ముజఫర్‌నగర్: ఇంటి దగ్గరి నుంచి ఒక బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన ముగ్గురు కామాంధులు.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తుపాకీతో కాల్చి చంపేస్తామని బెదిరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖేరి ఫిరోజాబాద్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

17 ఏళ్ల బాలికను శనివారం ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి, సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు. తుపాకీతో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన అనంతరం బాలిక ఈ విషయాన్ని తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

మరిన్ని వార్తలు