‘మరో రెండు వారాలు లాక్‌డౌన్‌’

29 May, 2020 15:41 IST|Sakshi

కరోనా గ్రాఫ్‌ పెరగడంపై ఆందోళన

పనాజీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించాలని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అన్నారు. మే 31తో ముగిసే లాక్‌డౌన్‌ను 15 రోజులు పొడిగించాలని తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఫోన్‌లో కోరానని చెప్పారు. అయితే లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇవ్వాలని సూచించారు.

రెస్టారెంట్లను 50 శాతం సీట్లతో భౌతిక దూరం పాటిస్తూ అనుమతించాలని కోరారు. జిమ్‌లను కూడా తెరవాలని పలువురు కోరుతున్నారని గోవా సీఎం చెప్పుకొచ్చారు. కరోనా వైరస్‌ గ్రాఫ్‌ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,65,000కు చేరింది.

చదవండి : హీరోయిన్‌ మాజీ భర్త ప్రేమలో మసాబా!?

మరిన్ని వార్తలు