పెరిగిన బంగారం, వెండి ధరలు

13 May, 2015 16:07 IST|Sakshi
పెరిగిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: వెండి, బంగారం ధరలు పెరిగాయి. బంగారం పది గ్రాముల ధర బులియన్ మార్కెట్లో 315 రూపాయలు పెరిగి, 27వేల 565 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలతోపాటు పెళ్లిళ్ల సీజన్లోబంగారు ఆభరణాలకు డిమాండ్ పెరగడంతో ధర పెరిగినట్లు భావిస్తున్నారు. వెండి ధర కూడా కిలోకి 700 రూపాయలు పెరిగి 38వేల 500 రూపాయలకు చేరింది.

ఈ నెల 4వ తేదీన బంగారం పది గ్రాముల ధర 27వేల 50 రూపాయలు ఉండగా, ఈ రోజుకు 515 రూపాయలు పెరిగింది.

మరిన్ని వార్తలు