హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బంగారం స్మగ్లింగ్‌.. అరెస్ట్‌

15 Feb, 2016 16:34 IST|Sakshi

హైదరాబాద్‌:  చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో సోమవారం డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హౌరా ఎక్స్‌ప్రెస్‌లో దంపతుల నుంచి 10 కేజీల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మయన్మార్‌ నుంచి కోల్‌కతా మీదుగా బంగారాన్ని చెన్నైకు దంపతులు తీసుకవచ్చారు.

హౌరా ఎక్స్‌ప్రెస్‌లో బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్నారంటూ అందిన పక్కా సమాచారంతో డీఆర్‌ఐ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బంగారం స్మగ్లింగ్‌ చేసిన మరియ సెల్వరాజ్‌ అనే దంపతులను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు