14 లక్షల కొత్త ఈవీఎంల కొనుగోలు

28 Apr, 2016 13:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ప్రతిపాదనల మేరకు 2019 సార్వత్రిక ఎన్నికలకోసం 14 లక్షల కొత్త ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు)లను కొనాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆ బృందం సిఫార్సులు చేసింది. వీటికోసం రూ.5,000 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టనున్నారు.

ఈ మంత్రుల బృందానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహించారు. 2015-16 నుంచి 2018-19 మధ్య దశలవారీగా వీటిని కొంటారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్నవాటిలో 9 లక్షలకు పైగా ఈవీఎంలు 2019 ఎన్నికల నాటికి పనికిరావు. ఈవీఎంలను బెంగళూరులోని బీఈఎల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లు తయారుచేస్తాయి.

మరిన్ని వార్తలు