బిహార్: బిహార్లోని గయ వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. కైమూర్ గయ ముగల్సరాయ్ మార్గంలో 14 గూడ్సు వ్యాగన్లు పక్కకు ఒరిగాయి. దీంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు.