ఎల్లోరా గుహలను ఆన్లైన్లో చూడచ్చు...

1 Aug, 2014 12:46 IST|Sakshi

ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన 1400 కళాకృతులను ఆన్‌లైన్‌లో వీక్షించనున్నారు. అలాగే సఫ్దర్‌జంగ్ సమాధులు, ఎల్లోరా గుహలు, పురాణ క్వీలా వంటి చారిత్రక ప్రాంతాలను గూగుల్ సాంస్కృతిక ఇన్‌స్టిట్యూట్ (జీసీఐ) వెబ్‌సైట్‌లో తిలకించవచ్చు. ఈ మేరకు చారిత్రక ఔన్నత్యం కలిగిన 76 ప్రాంతాలకు సంబంధించి 360 డిగ్రీల కోణంలో చూడగలిగే ఛాయచిత్రాలను విడుదల చేస్తున్నట్టు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.


భారత ఆర్కియాలజీకల్ సర్వే (ఏఎస్‌ఐ) సహకారంతో వీటిని జీసీఐ సైట్‌లో అప్‌లోడ్ చేసినట్టు వివరించింది. స్టీట్ వ్యూ టెక్నాలజీ సాయంతో ఈ చారిత్రక ప్రదేశాలను విహంగ విక్షణం చేసే అవకాశం కల్పించింది. దీంతో ఆన్‌లైన్‌లో చేరిన ఏఎస్‌ఐ ఆధ్వర్యంలోని చారిత్రక ప్రదేశాల సంఖ్య వందకు చేరింది. తాజ్‌మహల్, హుమాయున్ సమాధులు వంటి చారిత్రక ప్రదేశాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు.
 

మరిన్ని వార్తలు