వారణాసి ఫ్లైఓవర్‌ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

16 May, 2018 08:31 IST|Sakshi

వారణాసి : వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో యూపీ ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది.

ప్రమాద కారణాలను విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఓ కమిటీని నియమించింది. బుధవారం ఉదయం కమిటీ సభ్యులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కమిటీలో సభ్యునిగా ఉన్న రాజ్‌ ప్రతాప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. విచారణ పూర్తి కానిదే ఏ విషయం చెప్పలేమని తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరపకుండా ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. కాగా ఘటన స్థలంలోని శిథిలాల తొలగింపు పక్రియ పూర్తికావచ్చింది.

మరిన్ని వార్తలు